కామ్రేడ్ సిద్ద తో ‘ఆచార్య’.. వైరల్ అవుతున్న చిరు, చరణ్ పిక్..
Chiranjeevi – Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’..
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. రీసెంట్గా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చిరు, చరణ్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు.
తాజాగా ‘ఆచార్య’ లో తన లుక్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ ఫొటో షేర్ చేశారు చరణ్. ‘‘ఎ కామ్రేడ్ మూమెంట్.. డాడీ మరియు కొరటాల గారితో ‘ఆచార్య’ సెట్స్లో ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నా’’నంటూ చెర్రీ పోస్ట్ చేశారు. చిరు, చరణ్ భుజంపై చెయ్యివెయ్యగా, చరణ్ పక్కకి తిరిగి చూస్తున్నారు. సిద్ధ కామ్రేడ్గా కనిపించనున్నాడని తెలిసేలా అతని ముందు గన్ చూపించారు.
చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మే 13న సినిమా భారీగా విడుదల కానుంది..
A Comrade moment!
Enjoying every moment with Dad @KChiruTweets & @sivakoratala Garu on #Acharya sets.@MatineeEnt @KonidelaPro pic.twitter.com/FPhSCJf1f1— Ram Charan (@AlwaysRamCharan) March 1, 2021