టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడికెక్కాయి. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.