కోవిడ్ టైమ్లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
కరోనా మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు...