భీకర భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య 162కి పెరిగింది.
పెను భూకంపం ఇండోనేషియాను వణికించింది. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసింది. పదుల సంఖ్యలో భూకంపం ప్రజలను పొట్టన పెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. వేలాదిగా భవనాలు ధ్వంసమయ్యాయి.