Home » Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple
ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభమైంది.
మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు.