వైసీపీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీపెరిగి తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవచ్చునన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు.