ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.