AP Covid-19 Live Updates : ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

  • Publish Date - October 1, 2020 / 06:48 PM IST

AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు ఏడు లక్షలు దాటేశాయి. కరోనా కేసుల క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.



గడిచిన 24 గంటల్లో 7,297 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,577 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 6,751 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 41 మంది మృతిచెందారు.



ఇప్పటివరకూ రాష్ట్రంలో 58,78,135 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో కరోనా కేసులు 7,00,235 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,869 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 57,858 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,36,508 మంది డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు