YSR free crop insurance scheme : వైయస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ 15 కల్లా బీమా సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా సొమ్ము జమ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ రోజు శ్రీకారం చుట్టబోయే ఈ కార్యక్రమం రైతులకు మంచి చేసే దిశగా మరో అడుగు ముందుకేశామని చెప్పారు. 18నెలలుగా అడుగడుగునా ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతోందన్నారు.
ప్రతి అడుగూ రైతుకు తోడుగా ఉంటున్నాం..విత్తనం నుంచి రైతు పంట అమ్మకం వరకూ తోడుగా ఉంటున్నామని పేర్కొన్నారు. కరువులు, వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి అండగా ఉండడానికి ప్రభుత్వం ఎంత మనసు పెడుతుందో.. ఈ కార్యక్రమం ఉదాహరణగా ఉంటుందన్నారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు రూ.1,252 కోట్లు ఇవాళ వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఇదే విషయాన్ని చెప్పాం, అసెంబ్లీ సమావేశాల్లోకూడా డిసెంబర్ 15న ఇస్తున్నాం అని చెప్పామని తెలిపారు. ఆ మాటకు కట్టుబడి అదే డిసెంబర్ 15న ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు.
గతంలో పంటల బీమా ఎవరికి వచ్చేదో రైతులకే అర్థం అయ్యేది కాదు? పంటల బీమా వల్ల ప్రయోజనం లేదన్న అభిప్రాయం రైతులకు ఉండేది..బీమా వస్తుందో, లేదో తెలిసేది కాదు.. దీనివల్ల బీమా చేసుకున్న రైతుల సంఖ్య తక్కువగా ఉండేదన్నారు. రైతులు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థి ఉండేది కాదు..ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలని సంకల్పించామని పేర్కొన్నారు. పంట బీమా గుది బండ కాకూడదని, బీమా చెల్లింపు వ్యవస్థపై విశ్వసనీయత రైతులకు రావాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశామని తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా, పాదయాత్రలో చెప్పినట్టుగా పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ మాట్లాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. రైతులకు నష్టం రాకుండా బీమా సొమ్మును సరైన సమయంలో అందించాలన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేశామని చెప్పారు. గతంలో ఇన్సారెన్స్ ఒక భాగం రైతులు, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం, ఒక భాగం కేంద్ర ప్రభుత్వం చెల్లించేందన్నారు. చెల్లించిన తర్వాత బీమా సొమ్ము కోసం ప్రయత్నాలు చేసిన సందర్భాలు లేవన్నారు. ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి లేదని చెప్పారు. 2012 ఇన్సూరెన్స్ డబ్బును కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పించండం జరిగిందన్నారు. 2016–17 నుంచి 2018–19న రైతులు సగటున బీమా కంపెనీలకు రూ.298 కోట్లు కట్టేవారని తెలిపారు. ప్రభుత్వం తరఫున సగటున సంవత్సరానికి రూ. 393 కోట్లు చెల్లించేవారని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకూ మంచి జరగాలని సంకల్పించామని తెలిపారు. రైతులు కట్టాల్సిన వాటా, రూ.468 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటా రూ. 503 కోట్లు, మొత్తం రూ. 971 కోట్లు తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏడాదికి సగటున 20 లక్షల మంది రైతులూ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని పరిస్థితి ఉందని..ఇవాళ పరిస్థితి చూస్తే సగటున 49.81 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్ కిందకు వచ్చారని పేర్కొన్నారు. గతంలో సగటున 23. 57 లక్షల హెక్టార్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 45.96లక్షల హెక్టార్లు ఇన్సూరెన్స్ కిందకు వచ్చాయన్నారు. అక్షరాల 1 కోటి 14వేల ఎకరాలు ఇన్సూరెన్స్ కిందకు ఉన్నాయని చెప్పారు.
ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు ఉన్నాయని..10641 ఆర్బీకేలు ఉన్నాయని వెల్లడించారు. గ్రామ సచివాలయంలో అనుసంధానం అవుతున్నాయని చెప్పారు. గ్రామంలో ప్రతి ఎకరా ఇ– క్రాపింగ్ జరుగుతున్నాయని..ఈ వివరాలను ఆర్బీకేల్లో డిస్ ప్లే చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మొన్న వర్షాలు వచ్చి ఇబ్బందులు పడిన పరిస్థితుల్లోనూ.. వెంటనే ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల పరిధిలో ఉన్న ఇ– క్రాపింగ్ డేటా ఆధారంగా వెంటనే పంటనష్టం అంచనాలు నమోదు చేసి… వివరాలను ఆర్బీకేల్లో ఉంచామని తెలిపారు. ఎవ్వరికీ నష్టం రాకూడదు, ఎవ్వరూ మిగిలిపోకూడదని ఇలా చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఏ సీజన్కు జరిగిన పంటనష్టం.. అదే సీజన్లో ఇచ్చామని చెప్పారు. మొన్న పడ్డ వర్షాలకు సంబంధించి లెక్కల మదింపు కూడా ఇవాళ జరిగిపోయిందన్నారు. ఎవరైనా మిగిలిపోతే వారం రోజుల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. వీరికి డిసెంబర్ 31 మేలు చేసే లా రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను ఇ–క్రాపింగ్ చేసి, వైపరీతాల్య వల్ల పంటలు నష్టపోతే.. నష్టం అంచనాలు వేసి.. బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇ – క్రాపింగ్ వివరాలు సహా, ఇన్సూరెన్స్ లబ్ధిదారుల వివరాలను కూడా ఇస్తున్నామని తెలిపారు. అర్హులు అందరికీ అందించాలన్న తపన, తాపత్రయంతో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు.
2020 ఖరీఫ్కు సంబంధించి జనవరిలో పంట కోత ఎక్స్పర్మెంట్స్ అవగానే ఫిబ్రవరిలో ప్రణాళికా శాఖ నుంచి వివరాలు తీసుకుని మార్చి – ఏప్రిల్లోగా చెల్లిస్తామని చెప్పారు. మళ్లీ ఖరీఫ్కు సిద్ధంగా, జూన్కు తిరిగి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంత త్వరగా పరిహారం అదించడం ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేశారు. మొట్టమొదటి సారిగా రైతుకు ఏదైనా నష్టం జరిగితే.. మొన్న జరిగిన అకాల వర్షాల తరహాలో ఏదైనా జరిగితే రంగు మారిన ధాన్యమే కాదు, మొలకలెత్తిన ధాన్యాన్నికూడా గ్రేడెడ్ ఎంఎస్పీకింద కొనుగోలు చేసే చర్యలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గడచిన 18 నెలలుగా మనసున్న ప్రభుత్వంగా రైతులకు మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో చేస్తున్నామని చెప్పారు.