Annadata Sukhibhava Scheme: నేడే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.3 వేల కోట్లు
అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Scheme) పథకం కింద తొలి విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా విడుదల చేశారు.
- V Santhosh Kumar
- Updated on- June 20, 2026 / 07:26 AM IST
Annadata Sukhibhava funds to be released in Andhra Pradesh today
- రైతు ఖాతాల్లో రూ.7 వేలు జమ
- రూ.3,125 కోట్ల నిధుల విడుదల
- అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం
Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. ‘అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Scheme) – పీఎం కిసాన్’ పథకం కింద తొలి విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లింగంగుంట్ల నుంచి అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.85 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.3,125 కోట్లు జమ కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో భాగంగా ఈ నిధుల విడుదల ఒక మైలురాయిగా నిలిచింది.
Ap CGF Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికోసం ఏకంగా రూ.10 కోట్లు.. డైరెక్ట్ బ్యాంకులోకి
ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 చొప్పున జమ అవుతాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,342.92 కోట్లను విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్’ వాటా కింద రూ.782.55 కోట్లు సమకూరాయి. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డిబిటి (DBT) పద్ధతిలో బదిలీ కానున్నాయి. పెట్టుబడి సమయానికి ఈ ఆర్థిక సాయం అందడం వల్ల రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక భరోసా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రైతు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
