AP Pension Good News: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల ముందే పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్(AP Pension Good News) లబ్ధిదారులకు ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేయాలని నిర్ణయించింది.
- V Santhosh Kumar
- Published on- July 23, 2026 / 09:53 PM IST
Andhra pradesh govt early pension distribution july 30 north andhra districts
- రెండురోజుల ముందే పింఛన్లు
- భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం
- పన్నెండు లక్షలమందికి లబ్ధి
AP Pension Good News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన ఇచ్చే సామాజిక పింఛన్లను ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ముందస్తు పంపిణీ నిర్ణయంతో లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులకు తీవ్ర ఊరట లభించనుంది. ఆగస్టు 1వ తేదీన ప్రతిష్ఠాత్మక భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ భారీ కార్యక్రమం దృష్ట్యా పరిపాలనా యంత్రాంగం బిజీగా ఉండనుండటంతో, జూలై 30వ తేదీనే పెన్షన్ల (AP Pension Good News)పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జూలై 29 కల్లా నగదు ఉపసంహరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
6 జిల్లాల్లో రూ.514 కోట్లు విడుదల:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ముందస్తు పంపిణీ జరగనుంది. మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.514.42 కోట్లను సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమన్వయంతో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేయనున్నారు.
