Andhra Pradesh Covid 19 Cases : మరోసారి కరోనా విరుచుకపడుతోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తుండడంతో మళ్లీ లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.
Read More : Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు
ఏపీలో కరోనా కేసులు తగ్గిపోతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం ఒక్క కేసు మాత్రమే నమోదైన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో ఏపీలో 3 వేల 030 శాంపిల్స్ పరీక్షిస్తే.. నాలుగు కేసులు నమోదయ్యాయని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 06 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,11,274 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.
Read More : Covid 19 : ఏపీలో కరోనా.. 3,116 శాంపిల్స్ పరీక్షిస్తే
జిల్లాల వారీగా కేసులు : అల్లూరి సీతరామరాజు 00, అనకాపల్లి 00, అనంతపురం 00, అన్నమయ్య 00, బాపట్ల 00, చిత్తూరు 00, ఈస్ట్ గోదావరి 00, ఏలూరు 00, గుంటూరు 00, కాకినాడ 01, కొనసీమ 00, కృష్ణా 00, కర్నూలు 00, నంద్యాల 00, ఎన్టీఆర్ జిల్లా 01, పల్నాడు 00, పార్వతీపురం మణ్యం 00, ప్రకాశం 01, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 00, శ్రీ సత్యసాయి 00, శ్రీకాకుళం 00, తిరుపతి 00, విశాఖపట్టణం 01, విజయనగరం 00, వెస్ట్ గోదావరి 00, వైఎస్సార్ జిల్లా 00. మొత్తం : 04
#COVIDUpdates: 22/04/2022, 10:00 AM#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/uxm36zhGMM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 22, 2022