dgp harish gupta
AP Govt transfers SPs: ఆంధ్రప్రదేశ్లో ఎస్పీల బదిలీలపై కసరత్తు పూర్తయింది.14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. వాటిలో ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించగా, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.
మిగిలిన 12 జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: “హింస” తర్వాత తొలిసారి మణిపూర్లో పర్యటించిన మోదీ.. కీలక ప్రసంగం.. శాంతి సందేశం
ఉత్తర్వుల ప్రకారం ఏ జిల్లాకు ఎస్పీగా ఎవరు?
ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా
బాపట్ల- ఉమామహేశ్వర్
నెల్లూరు – అజితా వేజెండ్ల
తిరుపతి – సుబ్బారాయుడు
అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
కడప – నచికేత్
నంద్యాల్ – సునీల్ షెరాన్
ఇతర జిల్లాల నుంచి బదిలీ అయిన అధికారులు
విజయనగరం- ఏఆర్ దామోదర్
కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
గుంటూరు – వకుల్ జిందాల్
పల్నాడు – డి కృష్ణారావు
ప్రకాశం– హర్షవర్థన్ రాజు
చిత్తూరు – తుషార్ డూడి
శ్రీ సత్యసాయి – సతీశ్ కుమార్
శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా ఉన్నారు.