Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

Inter Results: ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ ఆఫీసులో విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సర విద్యార్థుల్లో 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ఆడపిల్లలదే పై చేయి.

  • ఇంటర్ ఫస్టియర్ లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్‌లో చిత్తూరు లీస్ట్ పర్సెంటేజ్ సాధించింది.
  • ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. అలాగే, 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ ఎగ్జాంలో మరొకసారి అవకాశం ఉంటుంది. మార్క్ లిస్ట్ లో సప్లమెంటరీలో పాస్ అయినట్లు ఉండదని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు. ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఎన్నికల నేపథ్యంలో సర్కారు నిర్ణయం మేరకు ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 4న ముగిసింది.

ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీలో 26 జిల్లాల్లో 1,559 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.

బాలబాలికల వారీగా ఫలితాల వివరాలు

  • మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 2,26,240 మంది
    ఉత్తీర్ణత సాధించిన వారు 1,43,688 మంది
    ఉత్తీర్ణత శాతం 64
  • మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలికలు 2,35,033 మంది
    ఉత్తీర్ణత సాధించిన వారు 1,67,187 మంది
    ఉత్తీర్ణత శాతం 71
    ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 1,88,849 మంది
    ఉత్తీర్ణత సాధించిన వారు 1,44,465 మంది
    ఉత్తీర్ణత శాతం 75
  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలికలు 2,04,908 మంది
    ఉత్తీర్ణత సాధించిన వారు 1,65,063 మంది
    ఉత్తీర్ణత శాతం 81
    ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో బాలికలదే పైచేయి

 Also Read: ఏపీలో టోఫెల్ పరీక్ష విజయవంతం.. హాజరైన 4.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

ట్రెండింగ్ వార్తలు