AP Rains: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

శనివారం నైరుతి రుతుపవనాలు రాయలసీమ (AP Rains)ప్రాంతాన్ని తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

India Meteorological Department announced that monsoon entered into Rayalaseema

  • ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
  • రాష్ట్రమంతటా విస్తరించడానికి అనుకూల వాతావరణం
  • గత ఏడాది కంటే కాస్త ఆలస్యం

Ap Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎండల తీవ్రత నుండి ఉపశమనం లభించింది. ఇండియన్ మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్ సమాచారం ప్రకారం, శనివారం (జూన్ 6) నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాన్ని తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడటమే కాకుండా, రాగల రోజుల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Paddy Prices: రైతన్నలకు కాసుల పంట.. ప్రభుత్వ మద్దతు ధరను దాటేసిన ధాన్యం రేట్లు.. ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యానికి భారీ డిమాండ్

రాష్ట్రమంతటా విస్తరణకు అనుకూల వాతావరణం:

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి కోస్తాంధ్రతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ విస్తరించే (Ap Rains)అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. ఖరీఫ్ సాగు పనులకు రైతులు సిద్ధమవుతున్నారు.

గత సంవత్సరంతో పోలిక:

గత ఏడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. గత సంవత్సరం మే 26వ తేదీనే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి కేరళ కంటే ముందే రాష్ట్రాన్ని పలకరించాయి. అయితే ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ప్రవేశించినప్పటికీ, ఇవి చురుగ్గా కదులుతుండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సకాలంలోనే తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.