Chandrababu quash petition: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటీషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు.

Chandrababu Petition On Skill Scam in Supreme Court

Chandrababu Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో ఒకేరోజు షాకులు తగిలాయి. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్ సోమవారం (సెప్టెంబర్ 25) విచారణకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పునిస్తు దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ త్రోసిపుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది.

Also Read : సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో చంద్రబాబు విచారణ

క్వాష్ పిటిషన్ కొట్టివేస్తు హైకోర్టు తీర్పునివ్వటంతో కస్టడీకి లైన్ క్లియర్ అయినట్లైంది. దీంతో ఏసీబీ కోర్టు చంద్రబాబుని సీఐడీ కస్టడికి అనుమతించింది. ఈ తీర్పు వెలువరించిన కొద్ది గంటలకే ఏసీబీ కోర్టు చంద్రబాబును సీబీఐ కస్టడికి అనుమతిస్తు తీర్పునిచ్చింది. ఈక్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలులోనే సీఐడీ అధికారులు చంద్రబాబుని విచారిస్తున్నారు.

ఇలా రెండు కోర్టుల్లోను చుక్కెదురు కావటంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంట్లో భాగంగానే .. క్వాష్ పిటిషన్ కొట్టివేశాక చంద్రబాబుతో చర్చించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ టీమ్ చేరుకుంది. చంద్రబాబుతో ములాఖత్ అయి సీఐడీ కస్టడీ, క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై బాబుతో చర్చించారు. దానికి చంద్రబాబు అంగీకరించటంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంతవరకు ఢిల్లీలోనే లోకేష్ ఉంటారని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: 100 రోజుల్లో ఏం చేస్తారు? దసరాకు విశాఖ నుంచి పరిపాలన అనేది డైవర్ట్ పాలిటిక్స్

కాగా చంద్రబాబుకు రెండు రోజుల సీబీఐ కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు..అధికారులకు పలు కీలక సూచనలు చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబు విచారణ జరగాలని, విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్య, వయస్సురీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే చంద్రబాబును విచారించే అధికారుల జాబితా తమకు అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీఐడీకి సూచించింది.

ట్రెండింగ్ వార్తలు