రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ పతనం ప్రారంభమైందని, దేవుడు కూడా కాపాడలేడని, సినిమా అయిపోయిందని చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
ఈ సభను నిర్వహిస్తున్నది టీడీపీ, జనసేన కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. జగన్ సిద్ధం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన టికెట్ ఇచ్చిన వాళ్లు మాత్రం పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు అవసరమని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లను తామే గెలుచుకుంటామని చెప్పారు. జగన్ చేస్తున్న తప్పుల వల్ల వైసీపీ నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. గల్లా జయదేవ్ రాజకీయాలు వద్దని అనుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పారు.
చంద్రబాబు కామెంట్స్..
Mandapeta: మండపేట ఎమ్మెల్యే సీటుకు మంట.. ఏం జరుగుతుందో తెలుసా?