Chandrababu Naidu: ఇక దేవుడు కూడా కాపాడలేడు.. సినిమా అయిపోయింది: జగన్‌పై చంద్రబాబు కామెంట్స్

ఈ సభను నిర్వహిస్తున్నది టీడీపీ, జనసేన కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Chandrababu Slams YS Jagan

రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ పతనం ప్రారంభమైందని, దేవుడు కూడా కాపాడలేడని, సినిమా అయిపోయిందని చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

ఈ సభను నిర్వహిస్తున్నది టీడీపీ, జనసేన కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. జగన్ సిద్ధం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన టికెట్ ఇచ్చిన వాళ్లు మాత్రం పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు అవసరమని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లను తామే గెలుచుకుంటామని చెప్పారు. జగన్ చేస్తున్న తప్పుల వల్ల వైసీపీ నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. గల్లా జయదేవ్ రాజకీయాలు వద్దని అనుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పారు.

చంద్రబాబు కామెంట్స్..

  • జగన్ అభిమన్యుడు, అర్జునుడు కాదు… భస్మాసురుడు
  • మరో 72 రోజుల్లో నీకు వ్యతిరేకంగా ఓటు వేసి భస్మాసుర వధ చేస్తాం
  • వైసీపీ నాయకులు నన్ను తిడుతుంటే నాకు పౌరుషం వస్తుంది… కానీ మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సైలెంట్ గా ఉన్నా
  • సిటీ ఎమ్మెల్యే అనిల్ కి అభివృద్ధి నిల్… మాటలు ఫుల్
  • అనిల్ ఇక్కడ దోచుకునేసి దాచుకునేశాడు… ఇక్కడ వ్యతిరేకత చూసి అనిల్ ని గాల్లో ఉంచేశారు జగన్
  • అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి…. పెద్ద దేకాయిట్ ఈ ఎమ్మెల్యే
  • కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఇన్స్టాల్ మెంట్ కింద కమిషన్లు తీసుకుంటున్నారు
  • ఆత్మకూరులో విక్రమ్ సొంత బంధువులకు కాంట్రాక్టులు ఇస్తున్నారు
  •  నన్ను, పవన్ కల్యాణ్‌ను తిట్టలేదని కందుకూరు ఎమ్మెల్యేకి సీటు లేదన్నారు
  •  మమ్మల్ని తిడితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంట

 

Mandapeta: మండపేట ఎమ్మెల్యే సీటుకు మంట.. ఏం జరుగుతుందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు