Kodali Nani : చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడు? : కొడాలి నాని

దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.

MLA Kodali Nani

Kodali Nani – Chandrababu : గుడివాడలో తనకు బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేశారు. గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా అని చెప్పుకునే నేతలు, టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా గుడివాడ 15వ వార్డులో రూ.3కోట్ల 28లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.

Perni Nani : పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమే : పేర్ని నాని

దోపిడీ చేయడానికి గుడివాడలో ఏమైనా ఇసుక రిచ్ లు, గ్రానైట్ క్వారీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడో డబ్బు తెచ్చి గుడివాడ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నానని అలాంటి తాను ఎవరి వద్ద నుండి దోపిడీకు పాల్పతానని నిలదీశారు. ఎవరి జేబులో చేయ్యి పెట్టినా ఐదు రూపాయలు మించి ఉండవు అని అన్నారు.

పేదల పక్షాపాతి సీఎం జగన్ : ఎంపీ వల్లభనేని బాలశౌరి
సీఎం జగన్ పేదల పక్షాపాతి అని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. నాలుగేళ్ల ఎనిమిది నెలల వైసీపీ పాలనలో 98శాతం మ్యానిఫెస్టో హామీలు అమలు చేశామని తెలిపారు. సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 2వందల కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులతో గుడివాడలో త్రాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు