CM Jagan : ప్రభుత్వం ఉద్యోగులది.. వారి సహకారంతో మంచి చేయగలుగుతున్నాను

మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు.

Jagan (1)

CM Jagan discussion : ప్రభుత్వం ఉద్యోగులది.. వారి సహకారంతో మంచి చేయగలుగుతున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగులు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చన్నారు. కానీ, ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామని చెప్పారు. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్నారు. రాజకీయాలకు తావు ఉండకూడదని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీ కూడా ఉందని తెలిపారు. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ఉద్యోగులదన్నారు. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

నిన్న మంత్రుల కమిటీ తనతో టచ్‌లోనే ఉందన్నారు. తన ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా ఉద్యోగులకు చెప్పడం జరిగిందన్నారు. ఐఆర్‌ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400 భారం పడుతోందని తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ రూపంలో అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోందని చెప్పారు. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్‌ఆర్‌ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోందని వెల్లడించారు. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోందన్నారు. ఆర్థికంగా పడే భారం ఇది అని పేర్కొన్నారు. మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Patient Death: కంటి ఆపరేషన్ కోసం వస్తే శవాన్ని అప్పగించిన ఆసుపత్రి

మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే… మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయని చెప్పారు. మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచామని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరిగాయని చెప్పారు. ఉద్యోగులు లేకపోతే తాను లేనని తెలిపారు. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నానని వెల్లడించారు. ఇది ఉద్యోగుల వల్లే సాధ్యపడుతోందన్నారు. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి చెప్పాలని కోరారు. రాబోయే రోజుల్లో సీపీఎస్‌ మీద గట్టిగా పని చేస్తున్నామని చెప్పారు. అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పని చేస్తున్నామని తెలిపారు.

వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటానని పేర్కొన్నారు. ఇవాళ మీరు కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత ఉద్యోగుల మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తానని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని చెప్పారు. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని విషయాలు కూడా ఉద్యోగులకు తెలియజేస్తానని చెప్పారు.

Raj Angad Bawa: ఒకప్పుడు గోల్డ్ మెడల్ విన్నర్ మనువడే వరల్డ్ కప్ విన్నర్

30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామని వెల్లడించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామని చెప్పారు. ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా తాము చేశామని చెప్పారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని.. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధమన్నారు. ఉద్యోగులు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.