ధర్మవరం SBI ఉద్యోగినిని చంపింది ఆమె ప్రియుడే

SBI employee  killed by her boyfriend : అనంతపురం జిల్లా ధర్మవరంలో SBI ఉద్యోగి స్నేహలత హత్య కేసును పోలీసులు చేధించారు. ఆమె ప్రియుడు రాజేశే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్నేహలతను హత్య చేసినట్లు అతడు విచారణలో అంగీకరించాడు. రాజేశ్‌కు సహకరించిన కార్తీక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్నేహలత మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న కారణంతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

ధర్మవరంలో SBI Bankలో కాంటాక్ట్ బేస్ కింద పని చేస్తున్న ఉద్యోగినిని స్నేహలతను దారుణంగా చంపేశారు. హత్య చేసిన అనంతరం ఆ యువతిని దహనం చేశారు. బడనపల్లి పొలాల్లో యువతి హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. హత్య చేసిన అనంతరం గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితులు దహనం చేశారని తెలిపారు. హత్యకు గురైన యువతి..స్నేహలతగా పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు