అన్న క్యాంటీన్ల పేరుతో కోట్లు కొట్టేశారు- అంబటి రాంబాబు

అవి ప్రభుత్వ క్యాంటీన్ లా, లేక టీడీపీ క్యాంటీన్ లా..? గతంలో వైసీపీ రంగులు అంటూ నానా హడావిడి చేశారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు..?

Ambati Rambabu : ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పేదలను ఆర్థికంగాపైకి తీసుకురావడం చంద్రబాబుకి ఇష్టం ఉండదని ఆయన అన్నారు. పేదలను ఆర్థికంగా పైకి తెచ్చేలా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే, చంద్రబాబు ఏమో పేదలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురాకుండా పూట అన్నం పెడతాం అని అన్న క్యాంటీన్ పెడుతున్నారని ధ్వజమెత్తారు.

పేదలకు భోజనం పెట్టాడానికి మేము వ్యతిరేకం కాదన్న అంబటి రాంబాబు.. అన్నం ఒక్కటే పెట్టి మిగతావి ఎగ్గొట్టడం సరికాదని హితవు పలికారు. గతంలోనూ ఇలానే అన్న క్యాంటీన్లు పెట్టి కోట్లు కొట్టేశారని ఆయన ఆరోపించారు. అన్న క్యాంటీన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు సొంత డబ్బులతో పెట్టినట్టు అన్న క్యాంటీన్ భవనాలకు పసుపు రంగులు వేయడం దారుణం అన్నారు.

”అవి ప్రభుత్వ క్యాంటీన్ లా, లేక టీడీపీ క్యాంటీన్ లా..? గతంలో వైసీపీ రంగులు అంటూ నానా హడావిడి చేశారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు..? ఓటమి ముందే గ్రహించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ పెట్టలేదు. మాకు 640 ఓట్లు ఉన్నాయి. మా ఓటర్లను మేము కాపాడుకున్నాం. మా వాళ్ళు ఐక్యమత్యంగా ఉన్నారు కనుకే చంద్రబాబు పోటీ పెట్టలేదు. టీడీపీ ప్రలోభాలకు గురి చేసినా మా ఓటర్లు లొంగలేదు. చంద్రబాబుకి అంత నైతికత ఉంటే లోకల్ బాడీల్లో ఫాలో అవ్వండి చూద్దాం” అని సవాల్ విసిరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

Also Read : జగన్ మళ్లీ అధికారంలోకి రారు- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు