జనసేనపై సోషల్ మీడియాలో కొందరు సృష్టించిన వార్త సంచలనంగా మారింది. ఉదయం నుంచి ఇది వైరల్ కావటంతో చాలా మందిలో కన్ఫ్యూజ్ నెలకొంది. దీనికి కారణం ట్రోలర్స్. జనసేన గుర్తు గాసు గ్లాసు. ఇప్పుడు ఆ గుర్తును ఈసీ తాత్కాలికంగా తొలగించిందని.. బ్లేడు గుర్తు కేటాయించిందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇది నిజమా అన్నట్లు చేసిన క్రియేవిటీ అందర్నీ డైలమాలో పడేసింది.
బ్లేడ్ గుర్తుపై వార్త ఏంటీ?
జనసేన పార్టీ అధికారిక లెటర్ హెడ్ కాపీని డూప్లికేట్ చేశారు. ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి అయిన పి.హరిప్రసాద్ పేరుతో ఈ విధంగా రాశారు. గాజు గ్లాసు గుర్తుపై కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ec మనకు తాత్కాలికంగా బ్లేడు గుర్తును కేటాయించడం జరిగింది. కావును బ్లేడు గుర్తును విరివిగా ప్రచారం చేయమని మనవి. బ్లేడు గుర్తుకే మన ఓటు. ఇట్లు పి.హరిప్రసాద్ పేరుతో.. అతని సంతకంతో ఈ లేఖ విడుదల అయినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లెటర్ హెడ్ లోనే బ్లేడు గుర్తుకే మన ఓటు అని పెద్ద అక్షరాలతోపాటు బ్లేడు సింబల్ వేశారు. చాలా మంది ఈ వార్తపై కన్ఫ్యూజ్ అవుతున్నారు.
నిజమా అని బయట వ్యక్తులు.. మీడియా మిత్రులకు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు అంటే.. ఎంతలా కన్ఫ్యూజ్ అయ్యారో ఈ వార్తతో అనేది స్పష్టం అవుతుంది.
దీనిపై జనసేన పార్టీ స్పందించింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. జనసేన కార్యకర్తలు ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని కోరారు. గుర్తు మారలేదని అధికారికంగా జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. లేఖ విడుదల చేసింది.