Minister Jogi Ramesh : వారి కలయిక పాయిజన్ తో సమానం.. టీడీపీని కాపులు క్షమించరు

టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారు. పవన్ కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు

Minister Jogi Ramesh

Jogi Ramesh comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెనడ మీటింగ్ అట్టర్ ప్లాప్ అయింది. ఆ సభకు కనీసం రెండు వేల మందికూడా రాలేదు. దీంతో టీడీపీ, జనసేన పొత్తుకు ప్రజల మద్దతు లేదని తేలిపోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కలయిక పాయిజన్ తో సమానం అంటూ విమర్శించారు. నేనేంటో పెడన ప్రజలకు తెలుసు. అందుకే నీ మీటింగ్ కు ప్రజలు రాలేదు పవన్ అంటూ జోగి రమేష్ అన్నారు. నన్ను అండమాన్ జైలుకి పంపుతాను అంటున్నావ్.. నీకు అంత సీన్ ఉందా పవన్ అంటూ ప్రశ్నించారు.

Read Also : Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేశ్.. ఎందుకంటే?

అత్తారింటికి దారేది సినిమా పైరసీ జరిగిందని 30మంది చేనేత పిల్లలను పోలీసులతో పవన్ కట్టించాడంటూ జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నిన్ను తిట్టిన తిట్లు మర్చిపోయావా పవన్? బ్లెడ్ వేరు బ్రీడ్ వేరు అని తిట్టినవి మర్చిపోయావా..? రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా పవన్ అంటూ ప్రశ్నించారు. టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారు. పవన్ కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు. రంగాను చంపి, ముద్రగడ ను అవమానించిన టీడీపీని కాపులు క్షమించరంటూ జోగి రమేష్ అన్నారు.

Read Also : Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

పవన్ కళ్యాణ్ పెద్ద పావలా.. పవన్ భారతీయుడా..? రష్యా వ్యక్తా..? ఇండియా లో పాస్ పోర్ట్ ఎందుకంటూ ప్రశ్నించిన మంత్రి.. వైఎస్సార్, జగన్ ల గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు