jr ntr key comments on political entry: ”ఎవరు మీలో కోటీశ్వరులు” హోస్ట్ గా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎన్టీఆర్ పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు తారక్ సమాధానం ఇచ్చాడు. కాగా, రాజకీయ ప్రవేశం గురించి ఓ మీడియా ప్రతినిధి ఎన్టీఆర్ ప్రశ్నించాడు.
దానికి ఎన్టీఆర్ ఇలా సమాధానం ఇచ్చాడు. మీరు చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న అడిగారు, అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే. రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడే సమయం, సందర్భం కాదు అని ఎన్టీఆర్ బదులిచ్చాడు. రాజకీయాల్లో ఎంట్రీపై త్వరలో మాట్లాడతానని చెప్పాడు.
గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ అలరించారు. ఈసారి జెమినీ టీవీలో ‘కోటీశ్వరులు ఎవరు మీలో’ పేరుతో మరో షో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు ప్రోగ్రాం ప్రోమోను యాజమాన్యం విడుదల చేసింది.
‘కథ మీది-కల మీది. ఆట నాది- కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న ప్రత్యేక డైలాగులు అలరిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో మరోసారి అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఇందులో కొత్త గెటప్లో తారక్ కనపడుతున్నాడు.
ఇక్కడ కల మీది కథ మీది. ఆట నాది కోటి మీది.
I’ll be waiting to meet you on the hot seat.
రండి గెలుద్దాం.https://t.co/k1X6PxlJHF
— Jr NTR (@tarak9999) March 13, 2021