Kadapa Double Murders: మరో షాద్ నగర్ టైప్ మర్డర్.. తల్లిని, కూతురిని హత్య చేసిన కిరాతకుడు.. కడపలో ఘోరం

కన్న తల్లి, కన్న కూతురిని ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో దారుణంగా హత్య (Kadapa Double Murders)చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

kadapa double murder babu kills mother and daughter surrenders

  • కడపలో ఘోరమైన జంట హత్యలు
  • తల్లి కూతురిని చంపిన నిందితుడు
  • మాదన్నపేట్ పోలీసు స్టేషన్‌లో లొంగుబాటు

Kadapa Double Murders: కడప జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్న తల్లి, కన్న కూతురిని ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు శ్రేణులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

Hyderabad: లగ్జరీ విల్లాల రాజధానిగా హైదరాబాద్.. రూ.8,562 కోట్ల విక్రయాలతో టాప్ పొజిషన్.. బెంగళూరు, చెన్నై సిటీలు అవుట్

వేర్వేరు ప్రాంతాల్లో దారుణ హత్యలు:

నిందితుడు బాబు తన కన్న కూతురు హారిక (17)ను కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండోరా కాలనీలో హత్య చేశాడు. అనంతరం సిద్ధవటం మండలం మాచుపల్లికి వెళ్లి తన కన్న తల్లి ఓబులమ్మ (60)ను కూడా దారుణంగా చంపేశాడు. ఈ రెండు హత్యల(Kadapa Double Murders) అనంతరం నిందితుడు మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయాడు.

రంగంలోకి దిగిన పోలీసులు – దర్యాప్తు ప్రారంభం:

సమాచారం అందుకున్న రిమ్స్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ముందస్తు ప్లాన్‌తో జరిగినట్లు అనుమానిస్తున్నారు.