Parawada Pharma city : అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

Parawada Pharma city : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Paravada Pharma City

Parawada Pharma city : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం తెల్లవారు జామున పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లను వెంకటేశ్, త్రినాథ్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు.

ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, విపత్తుల నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదంటే సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.