Nara Lokesh: తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం విజయనగరం నెల్లిమర్లలో శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ.. మా జోలికి వస్తే మీ సీటు మడతపెట్టి సీటు లేకుండా చేస్తామని అన్నారు. “నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం” అంటూ కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. జగన్ సర్కారును సాగనంపేందుకు సిద్ధమా అని టీడీపీ కార్యకర్తలను అడిగారు.
”ప్రజలే మా స్టార్ కాంపెయిన్లు అంటున్న జగన్ మద్యం షాపుల వద్ద చర్చకు వస్తారా? మద్యనిషేధమని చెప్పి, ఇప్పుడు రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. పోనీ మహిళల వద్ద చర్చ పెడదామా? చెత్త పన్ను, కరెంట్ చార్జీలు, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు కరెంట్ షాక్ తప్పదు. జగన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారు. సీఎం జగన్ స్కామ్ స్టార్ గా మారాడు.
రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం చేయించింది ఈ ప్రభుత్వం. దానిని చూసేందుకు చంద్రబాబు వస్తే వేధించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబం అక్రమ మైనింగ్ చేస్తూ కొండలను మిగేస్తోంది. ఇసుక సంపదను దోచుకుంటున్నారు. మత్సకారులకు జెట్టీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీఎం.. ఇంతవరకు అక్కడ కొంచెం మట్టికూడా వేయలేద”ని నారా లోకేశ్ విమర్శించారు.
Also Read: ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడాలన్న జగన్