Youngster Died In Ganesh Immersion : కాకినాడ జిల్లా ఉప్పాడలో విషాదం నెలకొంది. సముద్ర తీరంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఆరుగురు విద్యార్థులు వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా భారీ అలలు వారిని తాకాయి.
Immersion Of Ganapati: గణేష్ నిమజ్జనంలో విషాదం.. నీటిలో మునిగి ఏడుగురు మృతి
దీంతో ఇద్దరు గల్లంతయ్యారు. మత్స్యకారులు బోటు సాయంతో నలుగురిని కాపాడారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వంశీరెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. గల్లంతైన తమిళ శెట్టి, విజయవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.