×
Ad

అంతకు మించిన నేరం ఇది: టీటీడీ పరకామణి చోరీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విరాళాల కౌంటింగ్‌లో టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలిపింది.

AP High Court

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడుకలోకి తీసుకురావాలని చెప్పింది.

పరకామణి విషయంలో జరిగిన నేరం.. దొంగతనం కన్నా మించిందని తెలిపింది. టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని హైకోర్టు తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదని, దీని కారణంగా పరకామణిలో అటువంటి ఘటన జరిగిందని చెప్పింది. (TTD)

Also Read: శుభవార్త.. ఇక మరింత వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

విరాళాల కౌంటింగ్‌లో టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలిపింది. భక్తులను కూడా విరాళాల కౌంటింగ్‌ కోసం ఎందుకు తీసుకోకూడదని అడిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం కౌంటింగ్‌లో భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పింది.

ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విజిల్ టెక్నాలజీ తీసుకురావాలని హైకోర్టు చెప్పింది. కౌంటింగ్‌లో హ్యూమన్ ఇంటర్ ఫెరెన్స్ అవాయిడ్ చేయాలని తెలిపింది. టీటీడీలో టెక్నాలజీని వినియోగించాలని పేర్కొంది.