Kottu Satyanarayana : అమరావతి భూ కుంభకోణంలో పవన్ కల్యాణ్‌కి కూడా వాటా ఉంది- మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు

ఎందుకు చంద్రబాబు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలి. Kottu Satyanarayana

Kottu Satyanarayana - Pawan Kalyan (Photo : Google)

Kottu Satyanarayana – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పవన్ కి డబ్బు తప్ప వేరే ఆలోచన లేదన్నారు. కాపు జాతిని పవన్ తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. అమరావతి ల్యాండ్ స్కామ్ లో పవన్ కల్యాణ్ కి కూడా వాటా ఉందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. వారాహి యాత్రలో సీఎం జగన్ ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొట్టు తప్పుపట్టారు.

Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

”దేశం యావత్తు కోడై కూస్తుంది. పవన్ ప్యాకేజీలకి అమ్ముడుపోతున్నారని. నేను పవర్ స్టార్ కదా నన్ను ప్యాకేజీ స్టార్ అని అంటున్నారేంటని ఆలోచన, బుద్ది ఉందా అని అడుగుతున్నా? బాబుని లోపల వేస్తే సొంత కొడుకు హాయిగా ఉన్నాడు, దత్త కొడుకు రోడ్డు మీద పడుకున్నాడు. పవన్ చంద్రబాబు కలిసి జగన్ కు మా తడాఖా చూపిస్తామన్నారు. మరిప్పుడు ఏమైంది మీ తడాఖా? అమరావతి భూముల కుంభకోణంలో పవన్ కల్యాణ్ కి కూడా వాటా ఉంది. దానికి నిదర్శనం పవన్ కట్టిన పార్టీ కార్యాలయమే. పవన్ నీకేం తక్కువని? డబ్బుకు అమ్ముడుపోతూ జాతిని చంద్రబాబుకి తాకట్టు పెట్టేస్తున్నావ్.

Also Read..Gudivada Amarnath: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?

పవన్ కాపు సామాజిక వర్గం గౌరవాన్ని, పరువుని తాకట్టు పెట్టేస్తున్నారు. కాపులని సర్వనాశనం చేయడానికి ఉద్భవించవా నువ్వు? నీ ఒక్కడి సంపాదన కోసం కాపులను తాకట్టు పెట్టడం సరికాదు. ఎందుకు చంద్రబాబు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు కాపు జాతికి పట్టిన ముసలం” అంటూ పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, జనసేనాని పవన్ కల్యాణ్.. నిన్న (అక్టోబర్ 1) వారాహి యాత్ర 4వ విడతను అవనిగడ్డలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు