టీటీడీపై రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Publish Date - August 22, 2020 / 09:23 PM IST

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్రతిపాదించిందని ఆరోపించారు. అయితే టీటీడీ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లుగా రమణ దీక్షితులు ట్విట్టర్ లో పేర్కొన్నారు. టీటీడీని సీఎం జగన్ మళ్లీ ఆదేశిస్తారని అర్చకులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటివరకు కూడా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారని అందరూ అనుకుంటున్న తరుణంలో గౌరవ ప్రధాన అర్చక పదవిని తిరస్కరించినట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

గతంలోనే సీఎం జగన్ తనను బాధ్యతలు స్వీకరించాలని మాత్రమే ఆదేశించారని.. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా ప్రతిపాదించారని దాన్ని తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. అయితే గతంలోనే ఆయన గౌరవ ప్రధాన అర్చకులుగా టీటీడీలో ఉన్నట్లు ప్రకటన చేసింది. ఇది ఇప్పుడు సంచలన విషయంగా చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు