Andhra Pradesh Hindupur : హిందూపురంలో ఫ్లెక్సీల రగడతో టెన్షన్ టెన్షన్ … వైసీపీ నేతల ఫిర్యాదు, టీడీపీ, జనసేన వర్గీయుల అరెస్ట్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగానే హిందుపురం సిటీలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య వివాదాలు కొనసాగుతుండటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra Pradesh Hindupur Politics : శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఫ్లెక్సీల రగడ రోజు రోజుకు ముదురుతోంది. వైసీపీ నేతల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. వైసీపీ నేతల వ్యవహరాన్ని టీడీపీ,జనసేన కార్యకర్తలు ప్రశ్నించటం, అడ్డుకోవటంతో హిందుపురంలో రాజకీయాలు ఉద్రిక్తతతగా మారుతున్నాయి. శుక్రవారం (మే27,2023) జరిగిన ఫ్లెక్సీ వివాదంపై ఉద్రిక్తత
కొనసాగుతోంది.

పెత్తాందార్లకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్దం అంటు వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ ,జగన్ మోహన్ రెడ్డి, మహమద్ ఇక్బాల్ ఫోటోలతో ఫ్లెక్సీ వేశారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.ఫ్లెక్సీలో చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లను కించపరిచే విదంగా ఫ్లెక్సీలు వేశారంటు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకులు వేసిన ఫ్లెక్సీని చించేసారు టీడీపీ, జనసేన వర్గీయులు. దీంతో వైసీపీ, టీడిపి, జనసేన వర్గీయుల్ని అడ్డుకొన్నారు.

దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల తూటాలు విసురుకున్నారు.అదికాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇదికాస్తా తీవ్రమవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అందరిని చెదరగొట్టారు. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ, జనసేన వర్గీయులు చించేశారనే వైసిపి వర్గీయుల ఫిర్యాదు చేయటంతో పోలీసులు ముగ్గురు టీడీపీ,ఏడుగురు జనసేన వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న 10 మందిని ఈరోజు ఉదయం అదనపు జూనియర్ జడ్జి రాజ్యలక్ష్మి ముందు హాజరు పరచారు పోలీసులు . దీంతో జనసేన నాయకులపై అన్యాయంగా అక్రమ కేసులు భనాయించారంటు జనసైనికులు ఆందోళన చేపట్టటంతో
హిందూపురం పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

 







                                    

ట్రెండింగ్ వార్తలు