Balashowry: పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి

వైసీపీ ఎంపీగా బందరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలశౌరి ఇటీవల వైసీపీని వీడిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమక్షంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్దకు బందర్, అవనిగడ్డ, గుంటూరుల నుంచి బాలశౌరి అనుచరులు భారీగా తరలివచ్చారు.

వైసీపీ ఎంపీగా బందరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలశౌరి ఇటీవల వైసీపీని వీడిన విషయం తెలిసిందే. జనసేనలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బందర్ పార్లమెంటు నుంచే జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.

జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా గుంటూరు పట్టణంలోని నాజ్ సెంటర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఎంపీ బాలశౌరి గారి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మద్దతుగా తరలివెళ్లిన జనసేన నేతలు
బాలశౌరికి మద్దతుగా అవనిగడ్డ జనసేన పార్టీ నేతలు ఆయనతో మంగళగిరికి తరలివెళ్లారు. అవనిగడ్డ నుంచి 150 కార్లలో ర్యాలీగా జనసేన పార్టీ నాయకులు వెళ్లారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరినీ ప్రకటిస్తే, ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు.

Harish Rao: కృష్ణా జలాలపై రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్‌

ట్రెండింగ్ వార్తలు