YSR Congress Party: అన్ని జిల్లాలకు వైసీపీ నూతన కార్యవర్గం.. ఆ రెండు జిల్లాలు మినహా అంతా పాతవారే..
ఏపీలోని అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : August 25, 2023 / 01:31 PM IST
YSR Congress Party
CM YS Jagan: ఏపీలో 26 జిల్లాలకు కొత్త కార్యవర్గాన్ని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్షులు , కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించింది. విశాఖపట్టణం, అనకాపల్లి మాత్రమే మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం మిగిలినవన్నీ పాత వారినే కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లాల వారిగా అధ్యక్షుల వివరాలు..
అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే
అనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్
విశాఖపట్నం జిల్లా : కోలా గురువులు
అనంతపురం : పైల నరసింహయ్య
అన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి,ఎమ్మెల్యే
బాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీ
చిత్తూరు : కె ఆర్ జె భరత్, ఎమ్మెల్సీ
కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే
ఈస్ట్ గోదావరి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే
ఏలూరు : ఆళ్ల నాని, ఎమ్మెల్యే
గుంటూరు : డొక్కా మాణిక్య వరప్రసాద్
కాకినాడ : కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే
కృష్ణా : పేర్ని నాని, ఎమ్మెల్యే
కర్నూలు : వై బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే
నంద్యాల : కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా :వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే
పార్వతీపురంమన్యం : శత్రుచర్ల పరీక్షిత్ రాజు,
ప్రకాశం : జంకె వెంకటరెడ్డి
నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ
సత్యసాయి జిల్లా : ఎం. శంకరనారాయణ, ఎమ్మెల్యే
శ్రీకాకుళం :ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
విజయనగరం : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్
వెస్ట్ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే
వైఎస్ఆర్ జిల్లా : కె.సురేష్ బాబు, మేయర్
