చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ శ్రేణులపై దాడులను ఆపాలి.. : సామినేని ఉదయభాను

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైసీపీ వాళ్లను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు.

Samineni Udaya Bhanu

Samineni Udaya Bhanu :ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావుపై దాడి జరిగింది. ప్రత్యర్థులు కారుపై దాడి చేసి అతణ్ని తీవ్రంగా గాయపర్చారు. దీంతో స్థానికులు శ్రీనివాసరావును జగ్గయ్యపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. తాజా ఘటనపై మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాదే ప్రభుత్వం.. మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత ఐదేళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు లేదు. ఈ రెండు నెలల్లో వైసీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డు పై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారని సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.. గింజుపల్లి శ్రీనివాసరావు తండ్రి వీరయ్య మంచి నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు కట్టినందుకు వైఎస్సార్ వీరయ్యను సన్మానించారు. 2009లో వీరయ్యను ఆనాడు టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారు. తండ్రిని చంపిన వారే ఈరోజు శ్రీనివాసరావును హతమార్చాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి టీజీ వెంకటేశ్..

వీరయ్య హత్యలో ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనుంజయ్ కూడా ఒక ముద్దాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైసీపీ వాళ్లను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి శ్రీనివాసరావును చంపాలని చూశారు. మేం దాడులు చేయం.. హింసను ప్రోత్సహించమని సీఎం చంద్రబాబు నాయుడు ఒకపక్క పదేపదే చెబుతున్నారు. కానీ, టీడీపీ నేతలు.. శ్రేణులు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే దాడులను నిలువరించాలి. దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. వీరయ్య హత్య కేసులో సీబీసీఐడీ కేసు నుంచి సాక్షులను తొలగించారు. పోలీసులే ఛార్జిషీట్ వేసి కేసును దర్యాప్తు చేయాలి. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే దాడులను ఆపాలి.. నిందితులను శిక్షించాలని ఉదయభాను కోరారు. ఏ దాడి జరిగినా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. పోలీసులను అడిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. స్తామంటున్నారు. గతరాత్రి ఘటనలో అరెస్ట్ చేసిన వారిని కేసు తేలేవరకూ విడిచిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నాం.

Also Read : ఉమ్మడి విశాఖ జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్.. కూటమి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

శ్రీనివాసరావు సోదరుడు గింజుపల్లి మధు మాట్లాడుతూ.. టీడీపీ గెలిచిన రోజు నుంచి నవాబ్ పేటలో టీడీపీ దాడులు పెరిగిపోయాయి. ఫ్యాక్షన్ తరహాలో దాడులు చేస్తున్నారు. నా తండ్రిని చంపిన ముద్దాయిలే ఈ దాడులకు కారణం. నా తండ్రి హత్య కేసును పోలీసులే ఛార్జిషీట్ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు