YS Rajasekhara Reddy Vardhanthi : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ, భారతితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.