కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే ఉన్నాయంటూ ఎక్స్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
“అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ బీజేపీ చెలగాటం ఆడుతోంది అనడానికి నిదర్శనం. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనానికి అద్దం పడుతుంది.
కడప ఉక్కు సీమ ప్రజల హక్కు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే SAIL ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని UPA ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. విభజన చట్టంలోనూ పెట్టింది. అనంతరం అధికారంలోకొచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసింది.సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. కడప ప్రజలకు తీరని ద్రోహం చేసింది. తిరుపతి వేదికగా కడప స్టీల్ పై హామీ ఇచ్చిన మోదీ .. తర్వాత సాధ్యం కాదని, సొంత గనులు లేకుండా కష్టమని, లాభదాయకంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. కడప స్టీల్ పై మీ వైఖరి ఏంటి? కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా? కడప స్టీల్ ప్లాంట్ కడతారా? కట్టరా? ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పై మీ ముసుగు తీయండి సార్. అనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించక పోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే… రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు టెంకాయలు కొట్టారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే.
చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలో ఉందంటే మీ మద్దతు తోనే. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మోదీ ఇచ్చిన పదవులు ముఖ్యం కాకపోతే, విభజన హక్కు ప్రకారం కడప స్టీల్ ను కేంద్రం నిర్మించి ఇచ్చేలా ప్రకటన చేయించండి. లేకుంటే భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకొండి. కేంద్రం సహాయం లేకుండా రాష్ట్రమే నిర్మించే పనికి మోడీకి భజన చేయాల్సిన అవసరం ఉందా.. తేల్చుకోండి” అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి @hd_kumaraswamy గారు చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే. వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ @INC_Andhra తీవ్రంగా ఖండిస్తోంది. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా…
— YS Sharmila (@realyssharmila) December 10, 2024
వామ్మో పెద్ద పులి.. పరుగులు తీసి చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న మేకల కాపరి