Posani Krishna Murali : అది నిరూపిస్తే.. చంద్రబాబు కాళ్లు కడిగి వెంటనే టీడీపీలో చేరతా- పోసాని కృష్ణమురళి

చంద్రబాబు కాళ్లు కడిగి 150 అడుగుల విగ్రహం పెట్టిస్తానని అన్నారు. అంతేకాదు వెంటనే టీడీపీలో చేరిపోతానని ప్రకటించారు పోసాని.

Posani Krishna Murali : 10టీవీ ఓపెన్ డిబేట్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. చంద్రబాబుకి సంపద సృష్టించడం తెలుసని, టీడీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారని, వాటికి అవసరమైన డబ్బు సమకూర్చగలరని, అప్పులు కూడా తీర్చగల నేర్పరి చంద్రబాబు అని.. ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పోసాని తీవ్రంగా స్పందించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించలేదని పోసాని అన్నారు. ఒకవేళ చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సంపద సృష్టించినట్లు తెలిస్తే.. తాను చంద్రబాబు కాళ్లు కడిగి 150 అడుగుల విగ్రహం పెట్టిస్తానని అన్నారు. అంతేకాదు వెంటనే టీడీపీలో చేరిపోతానని ప్రకటించారు పోసాని.

”ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఒక్కరూపాయి అయినా సంపదను సృష్టించారా? దానికి చంద్రబాబు సమాధానం ఇస్తే ఆయన కాళ్లు కడుగుతా. అంబేద్కర్ విగ్రహం కన్నా పెద్దది 150 అడుగుల చంద్రబాబు విగ్రహం పెట్టిస్తా. ఒక్క రూపాయి సంపద సృష్టించినట్లు నోటితో చెప్పినా చాలు. ప్రతీ బడ్జెట్ లోటులో ఉందన్న విషయం అందరికీ తెలుసు. మరి సంపద ఎక్కడి నుంచి సృష్టించారు? కనీసం వంకాయ చెట్టు, బీరకాయ చెట్టు అన్నా సృష్టించావా బాబూ?

జనం గుడ్డోళ్లా? అమాయకులా? సంపద సృష్టించాను అని చంద్రబాబు చెబితే నమ్మేస్తారా? అవును నేను సంపద సృష్టించాను అని చంద్రబాబే స్వయంగా చెప్పక్కర్లేదు. వేరే వాళ్లతో చెప్పించినా చాలు. ఆయన ఒక్క రూపాయి అయినా సంపద సృష్టించాడు అని తెలిస్తే నేను వెంటనే టీడీపీలో చేరతా. వాళ్లు వద్దన్నా కూడా వాళ్లు కాళ్లు పట్టుకుని బతిమలాడి వాళ్ల దగ్గరే ఉంటాను” అని హాట్ కామెంట్స్ చేశారు పోసాని.

Also Read : తప్పు చేస్తే.. జగన్‌ అయినా ప్రశ్నిస్తా- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

 

 

 

ట్రెండింగ్ వార్తలు