Today Horoscope : నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి ధనలాభము..!

ఈ రోజు (2024, నవంబరు 7, గురువారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Astrological Prediction

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సరం కార్తీకమాసం శుక్ల షష్ఠి రాత్రి తె: 2:34 పూర్వాషాఢ : మ: 11:47 గురువారము

మేషం : పిల్లలతో ఇబ్బందులు, భార్య భర్త మధ్య చికాకులు, ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహించాలి. అన్యదేశములయందు నివసించుట, అనవసరపు విషయములవైపు వెళ్లకూడదు. దత్తాత్రేయ ఆలయములు సందర్శించు కొనవలెను, మంచి ఫలితములు వస్తాయి.

వృషభం : ఉద్యోగ లాభం, వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి. శరీరంలో రుగ్మతలు, అకాల భోజనము మోకాళ్ళ యందు నొప్పులు, ప్రయాణంలో ఇబ్బందులు సరియైన సమయంలో సరియైన నిర్ణయు తీసుకొంటారు. విద్యార్దులకు అధిక లాభం. శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించిన ఉత్తమ ఫలితములు వస్తాయి.

మిధునం : ఉద్యోగం అనుకూలము, జాయింటు ద్వారా వ్యాపారంలో లాభములు, గౌరవాభివృద్ది, కీర్తి పరోపకార కార్యములు చేయడం కుటుంబంలో జీవితములో సౌఖ్యము, ఆనందము, మనోధైర్యము ధనాదాయము బాగు ఉంటుంది. శరీర సౌఖ్యము లలితా సహస్ర నామ పారాయణం చేసిన శుభం జరుగును.

కర్కాటకం : ముత్యవ్యాపారములు, సరియైన సమయంలో సరియైన నిర్ణయము తీసుకుంటారు. మంచి ఉద్యోగములు రావడం, మధ్యవర్తితం మంచిది కాదు పరోపకార కార్యములు చేయటం, ప్రయాణముల విషయంలో జాగ్రత్త అవసరము సంతానము ద్వార శుభవార్తలు వినడం
: నవగ్రహ ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.

సింహ : ప్రయాణములలో ప్రమాదములు, మనో విచారము, ప్రయత్న కార్యములు చెడిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి కోర్టు సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో మధ్యర లాభములు, విధ్యారుల చదువు పట్ల ఆసక్తి చూపించాలి.
సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన..

కన్య : ధన సంపదలు పెరగడం, నూతన వ్యాపారము, విధ్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, ఉద్యోగంలో శుభ ఫలితములు, శుభ కార్యక్రమములలో పాల్గొనుట, వివాహ ప్రయత్నములు సఫలీకృతం కావడం దుర్గా స్తోత్ర పారాయణం చేయడం మంచిది

తులా : ఆనందం, ధనము చేతికి అందడం ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణ విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం బంధు మిత్రులతో వినోదములు, విందులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు సూర్య నమస్కారములు చేయడం ఉత్తమం

వృశ్చికం : అదికారుల ఆగ్రహం, అవరోదములు, ప్రయూణములలో ఆటంకములు, గొడవలు బంధు మిత్రులతో సహనం పాటించాలి. శుభకార్యక్రమములలో పాల్గొనటం, సోమరితనం, అపాయములు రుద్ర జపం చేసిన మంచిది.

ధనస్సు : నూతన వ్యాపారము, నూతన ఉద్యోగములు, శుభవార్తలు, ధనధాన్య లాభములు ఇష్టమైన వ్యక్తుల కలయిక, వృత్తి ఉద్యోగములందు లాభములు కలుగుతాయి, మాట పట్టింపులు, ప్రయాణములో అలసట సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం ఉత్తమం

మకరం : నూతన వ్యక్తుల పరిచయం విధ్యార్ధులకు అనుకూలము, ఫ్యాన్సీ, వెండి బంగారు, నగలు విలువైన దుస్తులు కొనుగోలు చేయడం. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారములో అభివృద్ధి రాణింపు ఉండును. శివ సహస్రనామార్చన ఉత్తమము

కుంభం: స్థానభ్రంశము, అవ్యస్థల నివాసము కోర్టు సమస్యలు, మోసపోవడం, కుటుంబ కలహములు, మానసిక ఆందోళనలు, పుత్ర మిత్ర విరోధములు కలుగును. సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం. అమ్మ వారి ఆరాధన వలన మేలు కలుగును.

మీనం: వ్యాపారంలో లాభము, తీర్థయాత్రతలు, పుణ్యక్షేత్రములు, నదీస్నానం, నూతన వ్యాపారములు, ఋణబాధలు తగ్గడం, విరోధములు, మోకాళ్ల నొప్పులు, ఉద్యోగంలో అనుకులత, అనారోగ్యము. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మంచిది

 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956