Bengaluru Techie
Bengaluru Techie : సొంతిల్లు అందరి కల. కానీ, కొందరు మాత్రమే ఆ కలను నిజం చేసుకుంటారు. అప్పు చేసి ఇల్లు కొనగానే సరిపోదు. ఆ అప్పు కూడా తీర్చినప్పుడే ఆ ఇల్లు పూర్తిగా సొంతం అవుతుంది. చాలామంది కొత్త ఇల్లు కొనేందుకు ఎక్కువగా బ్యాంకు లోన్లపైనే ఆధారపడుతుంటారు. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించకతప్పదు. ఒకటి లేదా రెండు ఈఎంఐలు తప్పినా ఆశపడి కొనుక్కోన్న కొత్త ఇల్లు బ్యాంకు లాగేసుకుంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే బెంగళూరు టెకీకి ఎదురైంది.
కేవలం 60 రోజుల్లోనే నడిరోడ్డుపైకి వచ్చేశాడు ఆ టెకీ.. దీనికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు టెకీ జీవితాన్ని ఒక లేఆఫ్ కోలుకోలేని దెబ్బతీసింది. 8 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ఈఎంఐలు చెల్లించినా వరుసగా మూడు ఈఎంఐలు ఆగిపోయాయనే కారణంతో రూ. 1.2 కోట్ల విలువైన ఇంటిని బ్యాంకు లాగేసుకుంది. దాంతో ఆ టెకీ రోడ్డున పడ్డాడు. ప్రస్తుతం టెకీ కన్నీటి గాథకు సంబంధించి నెట్టింట్లో చర్చ నడుస్తోంది.
అసలేం జరిగిందంటే.. ?
వైరల్ అవుతున్న సోషల్ పోస్టు ప్రకారం.. దాదాపు 8ఏళ్ల క్రితం ఓ బ్యాంకు నుంచి హోం లోన్ తీసుకున్నాడు టెకీ. రూ. 1. 2 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశాడు. చేతిలో సాఫ్ట్ వేర్ జాబ్ ఉండటంతో ప్రతినెలా ఇన్ టైమ్ ఈఎంఐలు పే చేస్తు వచ్చాడు. ఊహించని విధంగా అతడు పనిచేసే కంపెనీలో లేఆఫ్స్ జరిగాయి. ఒక్కసారి తన ఉద్యోగం పోయింది. మరో కొత్త ఉద్యోగం దొరకలేదు. దాంతో నెల జీతం లేకపోవడంతో అతడు కట్టాల్సిన ఈఎంఐలు ఆగిపోయాయి.
వరుసగా 3 ఈఎంఐలు చెల్లించలేదని కారణంతో అతడు లోన్ తీసుకున్న బ్యాంకు కేవలం 60 రోజుల్లోనే కోట్ల విలువైన ఇంటిని వేలం వేసింది. బెంగళూరుకు చెందిన సీఏ మీనల్ గోయల్ తన లింక్ డిన్ లో పోస్టు షేర్ చేయడంతో వైరల్ అయింది. రాజేష్ అనే టెకీ 2025లో జాబ్ కోల్పోయాడు.
జనవరి 2026 వరకు వరసగా 3 ఈఎంఐలు చెల్లించలేదు. బ్యాంకు SARFAESI చట్టం కింద రాజేష్ పై నోటీసు జారీ చేసింది. 60 రోజుల వ్యవధిలోనే ఆ కోట్ల ఇల్లు కూడా వేలం వేసింది. రూ. 1.2 కోట్ల విలువైన ఇల్లు కేవలం రూ. 95 లక్షలకే వేలంలో అమ్ముడైంది.
A Bengaluru resident lost his ₹1.20 crore flat after missing just three home loan EMIs due to job loss. The SARFAESI Act auctioned the flat for a mere ₹95 lakh.
CA Meenal Goel explained that her neighbour had been diligently paying EMIs for eight years. However, after default,…
— Amit Arora 🇮🇳 (@GuruShareMarket) March 2, 2026
అతడు 8 ఏళ్లు ఈఎంఐలు చెల్లిస్తే అతడికి కేవలం రూ. 15 లక్షలు మాత్రమే చేతికి వచ్చాయి. చెల్లించాల్సిన మొత్తం బకాయి రూ. 80 లక్షలను మాత్రం బ్యాంకు తీసుకుంది. ఈ పోస్టు ఆధారంగా సీఏ మీనల్ గోయల్ హోం లోన్ తీసుకున్నాక అది పూర్తిగా చెల్లించేంతవరకు అది మనది కాదని అన్నారు. హోం లోన్ తీసుకుంటే తప్పనిసరిగా ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర ఉంచుకోవాలని, లోన్ రెన్యువల్ చేయించుకోవడం చేయాలని తెలిపారు. వాస్తవానికి ఈ పోస్టు రెండు వారాల క్రితమే షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది నిజమేనా? ఎమోషనల్ పోస్ట్నా? నెట్టింట్లో తీవ్ర చర్చ :
ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. 90 రోజుల డిఫాల్ట్ తర్వాతే అకౌంట్ NPAగా మారుతుందని, వేలం వేసే చట్టపరమైన ప్రక్రియ అంత త్వరగా జరగదని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.
ఫ్లాట్ ధరపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలో ఆస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎనిమిదేళ్ల నాటి ఫ్లాట్ అసలు ధర కంటే తక్కువకు అమ్ముడుపోవడం అనుమానాస్పదమని అంటున్నారు. బ్యాంకులు సాధారణంగా పరిష్కారం కోసం అవకాశం ఇస్తాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.