Gold Rates: భారత్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నాటికి ఉన్న వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర నిన్నటికంటే రూ.10 పెరిగింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 పెరిగింది.
ఆంధ్ర, తెలంగాణలో బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర రూ.10 పెరిగి.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.76,110గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.83,030గా ఉంది.