Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎంతున్నాయో తెలుసా..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,04,900గా ఉంది.

భారత్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధరల్లో రూ.100 తగ్గుదల కనపడింది. మరోవైపు, అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారంలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి దాదాపు 80 వేల రూపాయలకు దగ్గరలో ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.79,390గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,610గా ఉంది.

Gold

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో బంగారం ధర రూ.10 తగ్గి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,540గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,760గా ఉంది
  • ముంబైలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.79,390గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,610గా ఉంది

వెండి ధరలు

దేశంలో వెండి ధరల్లో రూ.100 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,04,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,04,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,04,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.96,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.96,900గా ఉంది