Gold Price Today
Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. రాత్రికిరాత్రే ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,860 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1,700 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఐదు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,065 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. గురు, శుక్రవారాల్లో వెండి రేటు రూ.7వేలు తగ్గగా.. ఇవాళ వెండి రేటు 3వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీ పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,840కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,500కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,25,990కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,350 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,25,840కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,72,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,64,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,64,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.