Crude oil Spike : ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల ఎఫెక్ట్.. ఉద్రిక్తతలో మార్కెట్లు.. 5శాతం పెరిగిన ముడి చమురు ధరలు..!

Crude oil Spike : ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల ఎఫెక్ట్.. ఈ రెండు దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం మొదట ముడి చమురు ధరలపై పడింది. దాంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పెరిగాయి.

Iranian missiles on Israel set oil on fire, crude spikes 5 Percent

Crude oil Spike : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు భయాందోళనలకు గురయ్యాయి. దాదాపు 180 క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ రెండు దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం మొదట ముడి చమురు ధరలపై పడింది. దాంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పెరిగాయి.

Read Also : iPhone Order : ఆన్‌లైన్‌లో రూ. 1.5 లక్షల ఐఫోన్ ఆర్డర్ చేసి.. డెలివరీ ఏజెంట్‌ను చంపేసిన ఫ్లిప్‌కార్ట్ కస్టమర్..!

ముడి చమురు రంగంలో ఇరాన్‌‌దే ఆధిపత్యం.. ఒపెక్‌లో సభ్యదేశంగా ఉన్న ఇరాన్ ప్రమేయంతో చమురు సరఫరా గొలుసులో అంతరాయం కలిగించే భయాలను పెంచింది. ఎందుకంటే.. ఇరాన్ ప్రపంచంలోని చమురు సరఫరాలో మూడింట ఒక వంతును సరఫరా చేస్తుంది. నివేదిక ప్రకారం.. ఇరాన్ క్షిపణి దాడి కారణంగా సంక్షోభం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా చమురు ధరలు భారీగా పెరిగాయి.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావాన్ని పరిశీలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (డబ్ల్యుటీఐ క్రూడ్) ధరలు అకస్మాత్తుగా 5 శాతం వరకు పెరిగాయి. గతంలో సుమారు 2.7 శాతంగా పడిపోయింది. అయితే తాజా పెరుగుదల తర్వాత ముడిచమురుల ధర మరోసారి బ్యారెల్‌కు 71 డాలర్లకు దాటింది. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర విషయానికి వస్తే.. అది బ్యారెల్‌కు 5 శాతం ఎగబాకి 75 డాలర్ల పైన పెరిగింది. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75 డాలర్లకు పైగా పెరిగింది.

ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం :
గ్లోబల్ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం కేవలం ముడి చమురు ధరలపైనే కాదు.. ఇరాన్, ఇజ్రాయెల్‌లలో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కూడా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఎస్అండ్‌పీ-500లో 1.4 శాతం వరకు క్షీణత కనిపించగా, మరోవైపు డౌ జోన్స్, నాస్‌డాక్ కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇది కాకుండా, జపాన్ నిక్కీ కూడా 1.77శాతానికి పడిపోయింది.

ఇది మాత్రమే కాదు, సాధారణంగా విఐఎక్స్ అనే (Cboe) అస్థిరత సూచిక దాదాపు ఒక నెలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆందోళనలు వెంటాడుతున్నాయి. రెండు దేశాల మధ్య దాడుల కారణంగా తలెత్తిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింత ప్రభావాన్ని సూచిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుందని థెమిస్ ట్రేడింగ్‌లోని ఈక్విటీ ట్రేడింగ్ కో-హెడ్ జోసెఫ్ సలుజ్జీ అన్నారు.

Read Also : WhatsApp Filters : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. వీడియో కాల్స్‌కు ఫిల్టర్ ఎఫెక్ట్స్.. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు..!