PM Kisan 19th Installment
PM Kisan 19th Installment : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 19వ విడత ఫిబ్రవరి 24వ (సోమవారం) తేదీన అర్హులైన రైతుల ఖాతాల్లో విడుదల కానుంది. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ 19వ విడతను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఈ కాలంలో, దాదాపు రూ. 22వేల కోట్లు 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతాయి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ యోజన కింద ప్రతి లబ్ధిదారునికి రూ. 2వేలుగా ఇస్తుంది.
ఈ విధంగా, సంవత్సరానికి మొత్తం రూ. 6వేలు, 3 సమాన వాయిదాలలో చెల్లిస్తుంది. 18వ విడతలో లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లుగా ఉందని, ఇప్పుడు అది పెరిగిందని చౌహాన్ అన్నారు. 18వ విడతను ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదల చేశారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం రూ.3.46 లక్షల కోట్లు ఇచ్చింది. వచ్చే వారం 19వ విడత విడుదల తర్వాత ఈ మొత్తం రూ.3.68 లక్షల కోట్లకు పెరుగుతుంది.
ఫిబ్రవరి 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ స్కీమ్ :
పీఎం-కిసాన్ యోజన ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. డిసెంబర్ 1, 2018 నుంచి అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకం, రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఖర్చులను తీర్చడంలో సాయపడుతుంది. ఉత్పత్తిని పెంచడం, వ్యవసాయ ఖర్చును తగ్గించడానికి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
లబ్ధిదారుల రైతుల జాబితాలో మీ పేరును ఇలా చెక్ చేయండి :
ఆ తరువాత జాబితాలో ఉన్న పేర్లు వెల్లడి అవుతాయి. ఈ జాబితాలో మీ పేరు లేకపోతే.. మీరు పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్లైన్ (011-24300606)కు కాల్ చేసి మీ ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలు సరైన రైతులకు చేరేలా ప్రభుత్వం e-KYC (ఎలక్ట్రానిక్ KYC)ని తప్పనిసరి చేసిందని గుర్తుంచుకోండి.
మీ ఆధార్ కార్డు మొబైల్ నంబర్కు లింక్ చేసి ఉంటే మీరు పీఎం కిసాన్ పోర్టల్ను విజిట్ చేసి OTP ద్వారా e-KYC చేయవచ్చు. మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే మీరు సమీపంలోని CSC (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లి ఫింగర్ ఫ్రింట్ వెరిఫికేషన్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు.