PM Kisan Yojana
PM Kisan 20th Instalment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద అతి త్వరలో 20వ విడత విడుదల కానుంది. లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్-సీడెడ్ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు పడాలంటే ముందుగా e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో వివరంగా తెలుసుకుందాం..
పీఎం కిసాన్ అంటే ఏమిటి? :
రైతుల కోసం పీఎం కిసాన్ పథకం కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హతగల రైతులకు ఏటా రూ.6వేలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ.2వేలు చొప్పున 3 వాయిదాలలో పంపిణీ చేస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.
రూ. 2వేలు పడేది ఎప్పుడంటే? :
ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదాలు విడుదల అవుతాయి. గత ఫిబ్రవరిలో 19వ విడత విడుదల అయింది. జూన్ చివరి నాటికి 20వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.
e-KYC తప్పనిసరిగా ఉండాలా? :
పీఎం కిసాన్ డబ్బులు రూ. 2వేలు పడాలంటే e-KYC తప్పనిసరి. పారదర్శకతతో పాటు అసలైన లబ్ధిదారుల గుర్తించడం, సరైన బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం ఈ నిబంధనలను తప్పనిసరి చేసింది.
పీఎం కిసాన్ ( PM Kisan) కోసం e-KYC ఇలా చేయండి :
పీఎం కిసాన్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫింగర్ ఫ్రింట్ యాక్సెస్ లేని వారు చేయొచ్చు.
ఆధార్ ఆధారిత OTP e-KYC ఎలా పూర్తి చేయాలి? :
ఫేస్ అథెంటికేషన్ e-KYC (మొబైల్ యాప్) ఎలా పూర్తి చేయాలంటే? :
e-KYC స్టేటస్ సాధారణంగా 24 గంటల్లోపు పోర్టల్లో అప్డేట్ అవుతుంది.