PM Kisan 22nd instalment ( Image Credit to Original Source )
PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. అయితే, అర్హత కలిగిన రైతులకు మాత్రమే రూ. 2వేలు అందనున్నాయి. ఈ పథకం కింద, రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో కేంద్ర ప్రభుత్వ పథకం విడుదల చేస్తోంది.
ఈసారి 22వ విడత కోసం లబ్ధిదారు రైతులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కేవైసీ, ఫార్మర్ ఐడీ తప్పనిసరి. లేదంటే మీ బ్యాంకు అకౌంట్లలో రూ. 2వేలు పడవు. మీరు కూడా పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తుంటే ముందుగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
22వ విడత విడుదల ఎప్పుడంటే? :
2026 మార్చి చివరి నాటికి 22వ విడత రూ. 2వేలు విడుదలయ్యే అవకాశం ఉంది. 21వ విడత ప్రధానమంత్రి కిసాన్ లోన్ నవంబర్ 2025లో పంపిణీ అయింది. తర్వాత విడత మార్చి 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
eKYC తప్పనిసరి? :
అవును. పీఎం కిసాన్ పోర్టల్ ప్రకారం, నమోదైన రైతులందరికీ eKYC తప్పనిసరి. OTP-ఆధారిత ఇ-కేవైసీని పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్ ఆధారిత ఇకేవైసీ సమీపంలోని కామన్ సర్వీసు సెంటర్స్ (CSC)లో చేయవచ్చు.
రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి కాదా? :
రైతు రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభమైన 14 రాష్ట్రాల్లో కొత్త పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్లకు మాత్రమే ఫార్మర్ ఐడీ తప్పనిసరి.
రైతు గుర్తింపు కార్డు అవసరమయ్యే రాష్ట్రాలివే :
ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ కోసం కొత్త దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీని అందించాలి. రిజిస్ట్రీ పనులు ప్రారంభం కాని ఇతర రాష్ట్రాలలో, రిజిస్ట్రేషన్ కోసం ఫార్మర్ ఐడీ అవసరం లేదు.
పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
స్టేటస్ చెక్ చేసేందుకు ముందుగా ఇలా చేయండి.
1. అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ (PM-KISAN) విజిట్ చేయండి.
2. ఫార్మర్స్ కార్నర్ కింద ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
3. క్యాప్చాతో పాటు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి.
4. పూర్తి వివరాలను చూసేందుకు ‘Get Status’పై క్లిక్ చేయండి.
22వ విడత ఎవరికి అందకపోవచ్చు? :
రైతుల అర్హత ఎలా ధృవీకరించాలి? :
రైతులు పీఎం కిసాన్ పోర్టల్లోని ‘Know Your Status’ ఆప్షన్ ద్వారా లేదా ‘Kisan eMitra’ చాట్బాట్ ద్వారా వారి అర్హతను చెక్ చేయవచ్చు.