Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెడుతున్నారా? 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల ఎవరైనా గ్రామ సురక్ష యోజన పథకం (Gram Suraksha Yojana)లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ పోస్టాఫీస్ పథకంలో కనీసం రూ. 10వేల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పోస్టాఫీస్ పథకంలో ఎలాంటి ప్రమాదం లేకుండా భారీగా రాబడిని పొందొచ్చు.
Read Also : Hallmark Gold : మీరు కొనే బంగారం మంచిదేనా? స్వచ్ఛత ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!
పోస్టాఫీస్లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. లక్షలాది మంది పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతారు.
పోస్టాఫీస్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద అనేక పథకాలు ప్రారంభమయ్యాయి. ఇందులో గ్రామ సురక్ష యోజన కింద పథకం (Gram Suraksha Yojana) కోసం రోజుకు రూ. 50 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రూ. 35 లక్షల వరకు భారీగా డబ్బులను కూడబెట్టొచ్చు. భారతీయ పోస్టాఫీసులో అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. కోట్లాది మంది పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందొచ్చు.
అందుకే చాలా మంది పోస్టాఫీస్ పథకాలలో డబ్బు పెట్టుబడి పెడతారు. పోస్టాఫీస్ పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.
గ్రామ సురక్ష యోజన ఏంటి? :
గ్రామ సురక్ష యోజన (Post Office Scheme) లో పెట్టుబడి పెట్టే 35 లక్షల పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం మొత్తాన్ని 80 ఏళ్ల వయస్సులో పెట్టుబడిదారునికి బోనస్తో పాటు అందిస్తారు.
పెట్టుబడి పెట్టే వ్యక్తి 80 ఏళ్ల వయస్సులోపు మరణిస్తే.. నామినీకి ఈ మొత్తం లభిస్తుంది. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు గల భారతీయ పౌరుడైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
రూ. 10వేల నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన వాయిదాలను చెల్లించవచ్చు. మీరు 19 ఏళ్ల వయస్సులో గ్రామ సురక్ష యోజనను కొనుగోలు చేస్తే.. 55 ఏళ్ల వయస్సు వరకు రూ. 1,515 ప్రీమియం చెల్లించాలి.
గ్రామ సురక్ష పథకంలో బోనస్ :
ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారికి 4 ఏళ్ల తర్వాత రుణ సౌకర్యం లభిస్తుంది. పాలసీదారుడు సరెండర్ చేయాల్సి వస్తే.. పాలసీ ప్రారంభించిన తేదీ నుంచి 3 ఏళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల 5 ఏళ్ల తర్వాత బోనస్ కూడా లభిస్తుంది.
ఎంత డబ్బు అందుతుంది? :
ఈ పథకంలో అర్హత ఉన్న వ్యక్తి ప్రతి నెలా రూ.1,500 డిపాజిట్ చేస్తే.. రోజుకు రూ.50 మాత్రమే ఖర్చు చేయాలి. పథకం మెచ్యూరిటీ తర్వాత రూ.35 లక్షల వరకు రాబడిని పొందవచ్చు.
పూర్తి మొత్తం ఎప్పుడంటే? :
ఒక పెట్టుబడిదారుడు 55 ఏళ్ల కాలంలో మెచ్యూరిటీపై రూ. 31,60,000, 58 ఏళ్లలో మెచ్యూరిటీపై రూ. 33,40,000, 60 ఏళ్లలో రూ. 34.60 లక్షలు పొందుతారు.
Read Also : PF Employees : బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షన్.. ఎంతో తెలుసా?
గ్రామ సురక్ష యోజన కింద 80 ఏళ్లు నిండిన తర్వాత డబ్బును అందిస్తారు. మరోవైపు, వ్యక్తి మరణించినట్లయితే ఈ డబ్బు నామినీకి అందుతుంది.