హైదరాబాద్ ముషీరాబాద్ లో పేలుడు ఘటన కలకలం రేపింది. చెత్తకుప్పలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స
హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం పేలుడు జరిగింది. చెత్తకుప్పలో బ్లాస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటన కలకలం రేపింది. ఈ పేలుడులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కెమికల్ డబ్బా పేలిందని తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన వ్యక్తిని నాగయ్యగా పోలీసులు గుర్తించారు.
చెత్తకుప్పలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.