వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో శవం, 10రోజులుగా ఆ నీళ్లనే తాగుతున్న జనం..! నల్గొండలో ఘోరం

తాగునీరు తేడాగా ఉండడంతో ప్రజలు వాటర్ సప్లయ్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకిలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు.

Dead Body In Water Tank : నల్లగొండ మున్సిపాలిటీలో పాతబస్తీ హిందూపూర్ లో ఘోరం జరిగింది. వాటర్ ట్యాంక్ లో శవం కనిపించింది. కాగా, ఆ వాటర్ ట్యాంక్ నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీలోని పలు వార్డుల ప్రజలు తాగుతున్నారు. నీళ్ల ట్యాంకులో మృతదేహం ఉందని తెలిసి స్థానికులు కంగుతిన్నారు.

తాగునీరు తేడాగా ఉండడంతో 11వ వార్డు ప్రజలు వాటర్ సప్లయ్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకిలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. దాంతో మున్సిపాలిటీ సిబ్బంది స్పందించింది. స్థానికులతో కలిసి వెళ్లి ట్యాంక్ లో వాటర్ ని చెక్ చేశారు. అంతే, అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వాటర్ ట్యాంక్ లో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. దీంతో అందరికీ దిమ్మతిరిగిపోయింది. ఈ విషయం తెలియక ఇన్నాళ్లు ఆ నీటినే తాగామన్నారు. విషయం తెలిశాక ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు వాటర్ ట్యాంక్ లోకి డెడ్ బాడీ ఎలా వచ్చింది? అన్నది మిస్టరీగా మారింది.

కాగా.. నీళ్ల ట్యాంక్ లో కనిపించిన మృతదేహాన్ని హనుమాన్ నగర్ కి చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. వంశీ మే నెల 24వ తేదీ నుంచి కనబడటం లేదని అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించడం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలేం జరిగింది? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.

Also Read : ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్.. హైదరాబాద్ వ్యక్తి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన స్కామర్లు!

ట్రెండింగ్ వార్తలు